భోజనప్రియులకు ఈ బ్లాగ్ లో అన్ని రకాల వెజ్ , నాన్ వెజ్ మరియు ఫాస్ట్ ఫుడ్ వంటలు వున్నాయి.
పాలకోవా
కావలిసిన వస్తువులు
పాలు : ఒక లీటర్
పంచదార : 1/4 కేజీ
నెయ్యి : కొద్దిగా
తయారుచేయు విధానం
* పాలను సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ సుమారు గంట సేపు కాగనివ్వాలి.
* పాలు చిక్కబడి ముద్దగా అవుతుండగా పంచదారను పోసి మళ్ళి కలుపుకోవాలి.
* పంచదార కరిగి పల్చగా అయి తరువాత కోవా గట్టి పడుతుంది.
* అంచులు ఉన్న పళ్ళానికి నెయ్యి పూసి అందులోనికి కోవా పోసుకోవాలి.
* దానిని కొద్ది సేపు మెత్తగా నూరుకోవాలి. కోవా రెడీ.
చికెన్ పకోడి
కావలిసిన వస్తువులు
చికెన్ : 750 గ్రాములు
శనగపిండి : 600 గ్రాములు
తాజా నిమ్మరసం : 4 స్పూనులు
కారం : రెండు స్పూనులు
ఆవాల పొడి : 3 స్పూనులు
వెనిగర్ : 1 స్పూను
అజినోమాటో : 1 స్పూను
నెయ్యి : 250 గ్రాములు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చికెన్ ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పోర్క్ తో బాగా పొడిచి ఉప్పు కారం ఆ ముక్కలకు పట్టేలా చెయ్యాలి.
* మిగిలిన పొడి మసాలలన్ని ఆ ముక్కలకి కలిపి పైన నిమ్మరసం వెనిగర్ చల్లి బాగా కలిపి రెండు గంటలపాటు ఊరనివ్వాలి.
* శనగపిండి లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి.
* ఊరిన చికెన్ ముక్కలను పిండేసి వేరే గిన్నెలో వేసుకోవాలి.
* మొదట గిన్నెలో మిగిలిన మసాలలన్ని సెనగపిండి కలిపెయ్యాలి.
* నెయ్యిని బాగా కాచి చికెన్ ముక్కలిని పిండిలో ముంచి నేతిలో వేపాలి.
* సగం వేగాక సన్న సెగ చేసి బాగా వేయించాలి.
ఉగాది పచ్చడి
కావలసిన వస్తువులు :
వేప పువ్వు : 1కప్పు
బెల్లంపొడి : 1కప్పు
కొబ్బరికోరు : 1కప్పు
బాగాముగ్గిన అరటి పండ్లు : 6
మామిడికాయ : 1
కొత్తకారము : చిటెకెడు
ఉప్పు : అరస్పూను
శనగ పప్పు పొడి : 1కప్పు
చింతపండు : నిమ్మకాయంత
వేయించిన వేరుశనగపప్పు : అర కప్పు
తయారుచేయు విధానం
* చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి.
* అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి.
* మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి.
* చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి.
* వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
మామిడికాయ చేపల పులుసు
కావలిసిన వస్తువులు
చేపలు : ఒక కిలో
మామిడికాయలు : రెండు
పచ్చిమిర్చి : 12
ఉల్లిపాయలు : 250 గ్రాములు
వెల్లులి : 25 గ్రాములు
కారం : రెండు టీ స్పూనులు
ధనియాలు : 25 గ్రాములు
జీలకర్ర : 25 గ్రాములు
నూనె : 150 గ్రాములు
కరివేపాకు : సరిపడా
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చేపలను శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు వేసి బాగా కడిగి ఒక పాత్రలో ఉంచాలి.
* ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా ఉంచుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.
* మసాలా పొడులన్నీ చేపలకు పట్టేల కలపాలి.
* ఉల్లిపాయలు ఉన్న దానిలో చేపముక్కలు వేసి బాగా కలపండి.
* మామిడి కాయలను ముక్కలుగా కోసి ముందుగానే మెత్తగా ఉడికించి తరువాత చేపల ముక్కలలో కలపాలి.
* చేపలు బాగా ఉడికిన్చుకొని గ్రేవీ ఉంచుకొని దించుకోవాలి.
మటన్ తో పప్పు పులుసు
కావలిసిన వస్తువులు
మటన్ : ఒక కిలో
కందిపప్పు : 200 గ్రాములు
నూనె : 300 గ్రాములు
ఉల్లిపాయలు : 4
ఉప్పు : సరిపడా
వెల్లులి : 8 రెబ్బలు
లవంగాలు : 8
పచ్చిమిర్చి : 8
దాల్చినచెక్క : 8
కారం : 4 స్పూనులు
గసగసాలు : 4 స్పూనులు
చింతపండు : నిమ్మకాయంత
కొత్తిమీర : ఒక కట్ట
అల్లం : చిన్న ముక్క
కొబ్బరి : చిన్న ముక్క
తయారుచేయు విధానం
* పప్పు శుభ్రం చేసి ఒక పాత్రలో ఉంచాలి.
* చింతపండును నీళ్ళలో నానపెట్టుకోవాలి.
* మటన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
* ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఆల్లం వెల్లుల్లి ఒక ముద్ద, కొబ్బరి గసగసాలు ఒక ముద్ద గా నూరుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక చెక్క లవంగాలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉడికాక మటన్ వేసుకోవాలి .
* మసాలలున్ని అందులో వేసి, నీళ్లన్నీ ఇరిగిపోయక ఉప్పు కారం వేసి ఎసరు పొయ్యాలి.
* అందులో పప్పు వేసి మెత్తగా ఉదికించుకొని అందులో చింతపండు పులుసు పిసుకొని పోసుకోవాలి.
* గసగసాలు కొబ్బరి ముద్ద , కొత్తిమీరా వేసి గ్రేవీ ఉండేలా దించుకోవాలి.
వంకాయ పులుసు
కావలిసిన వస్తువులు
వంకాయలు : 1/4 కిలో
టమేటా : 4
చింతపండు : 25 గ్రాములు
నూనె : 25 గ్రాములు
పచ్చిమిర్చి : 10
ఉల్లిపాయలు : 4
ఎండుమిర్చి : 2 కాయలు
పోపుగింజలు : సరిపడా
కరివేపాకు : రెండు రెబ్బలు
పసుపు : సరిపడా
కారం : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చింతపండు నీళ్ళలో నానపెట్టాలి.
* వంకాయలను నిలువుగా కోసుకోని నీళ్ళలో వేసి ఉంచాలి.
* ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరుముకోవాలి.
* టమేటాలు వేరే ప్లేట్లో కోసుకొని పెట్టుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపు గింజలు వేసి వేయించి కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి.
* తరువాత వంకాయ ముక్కలను వేసి ఉప్పు, పసుపు, కారం చల్లి మూత పెట్టి పది నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి.
* తరువాత నానపెట్టిన చింతపండును బాగా పల్చగా పులుసుగా పిసికి అది వంకాయ ముక్కలలో పోసి కొంచెం సేపు ఉడికించాలి.
* దానిలో టమేటా ముక్కలు వేసి ఐదు నిమిశాలుపాటు మగ్గిన తరువాత దించుకోవాలి.
మిరియాల చారు
కావలిసిన వస్తువులు
చింతపండు : నిమ్మకాయంత
పచ్చిమిర్చి : 10
మిరియాలు : 10
ఉప్పు : సరిపడా
కొత్తిమీరా : అర కట్ట
కరివేపాకు : 2 రెబ్బలు
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం
* రెండు గ్లాసుల నీళ్ళలో చింతపండు, ఉప్పు మరియు పసుపు వేసి బాగా పిసుకొని పెట్టుకోవాలి.
* ఆ నీళ్ళలో కరివేపాకు, కొత్తిమీరా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
* మిరియాలను మెత్తగా పొడుం కొట్టుకోని, చారు నీటిలో వేసుకోవాలి.
* తరువాత ఆ చారును బాగా మరిగించి దించి దానిని తాలింపు పెట్టుకోవాలి
ఉల్లిపాయపకోడిలు
కావలిసిన వస్తువులు
శనగపిండి : 1 కప్పు
బియ్యం పిండి : 1 కప్పు
నెయ్యి : 2 టేబుల్ స్పూను
వంట సోడా : 1 చిటికెడు
ఉల్లిపాయ : 4
పచ్చిమిర్చి : 4
కారం : సరిపడా
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : సరిపడా
నూనె : సరిపడా
తయారుచేయు విధానం
* బియ్యం పిండి, శనగపిండి కలిపి ఇందులో ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి.
* కొద్దిగా వంటసోడా, నెయ్యి కలుపుకోవాలి.
* పిండిని బాగా కలుపుకొని మిగతా పదార్దాలు కూడా చేర్చాలి.
* పకోడీలు వేసుకొనేటప్పుడు పచ్చిమిర్చి ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకొని ఈ పేస్ట్ ను పకోడీ పిండిలో కలుపుకోవాలి. ఇలా చేస్తే పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడి చేసి, ఆ తరువాత కొద్ది కొద్దిగా పిండి తీసుకోని పకోడీలు వేసుకోవాలి.
సొరకాయ హల్వా
కావలిసిన వస్తువులు
సొరకాయ : 1/2 కేజీ
పంచదార : 200 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
కోవా : 200 గ్రాములు
బాదంపప్పు : 10 గ్రాములు
పిస్తా పప్పు : 10 గ్రాములు
యాలకుల పొడి : 5 గ్రాములు
తయారుచేయు విధానం
* సొరకాయ ఫై చెక్కు తీసుకుని తరుముకోవాలి.
* దీన్ని నెయ్యిలో వేయించిన తరువాత పాలు, పంచాదార కలపాలి.
* పాలు బాగా ఇంకిపోయే వరకు ఉడికించి ముద్దగా అయినాక దించుకోవాలి.
* తరువాత ఫైనా యాలకుల పొడి చల్లాలి, కోవా, బాదంపప్పు, పిస్తాపప్పుతో అలంకరించుకోవాలి.
సొరకాయ : 1/2 కేజీ
పంచదార : 200 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
కోవా : 200 గ్రాములు
బాదంపప్పు : 10 గ్రాములు
పిస్తా పప్పు : 10 గ్రాములు
యాలకుల పొడి : 5 గ్రాములు
తయారుచేయు విధానం
* సొరకాయ ఫై చెక్కు తీసుకుని తరుముకోవాలి.
* దీన్ని నెయ్యిలో వేయించిన తరువాత పాలు, పంచాదార కలపాలి.
* పాలు బాగా ఇంకిపోయే వరకు ఉడికించి ముద్దగా అయినాక దించుకోవాలి.
* తరువాత ఫైనా యాలకుల పొడి చల్లాలి, కోవా, బాదంపప్పు, పిస్తాపప్పుతో అలంకరించుకోవాలి.
పిస్తా మిల్క్ షేక్
కావలిసిన వస్తువులు
చిక్కటి మీగడ పాలు : 1 లీటర్
పంచదార : 8 టీ స్పూనులు
పిస్తా పేస్టు : 50 గ్రాములు
పిక్కా కోవా : ఒక టేబుల్ స్పూను
ఐస్ క్యూబ్స్ : 6
యాలకుల పొడి : పావు స్పూను
ఉప్పు : సరిపడా
గ్రీన్ ఫుడ్ కలర్ : చిటికెడు
తయారుచేయు విధానం
* ముందుగా పాలను కాచి చల్లార్చాలి.
* మిక్సి జ్యూస్ జార్ లో పాలు, పంచాదార, పిస్తాపెస్ట్, పిక్కాకోవా, యాలుకలపొడి, ఉప్పు, పుడ్ కలర్, ఐస్ క్యుబ్స్ వేసి బాగా తిప్పాలి.
* కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది.
ఉలవచారు
కావలిసిన వస్తువులు
ఉలవలు : పావు కిలో
నూనె : 50 గ్రాములు
చింతపండు : 50 గ్రాములు
పసుపు : కొద్దిగా
కరివేపాకు : సరిపడా
పచ్చిమిర్చి : 8
కొత్తిమీర : సరిపడా
ఉప్పు : సరిపడా
పోపులు : సరిపడా
తయారుచేయు విధానం
* ఉలవలను ఒక రోజు ముందుగా 6 గ్లాసుల నీళ్ళలో ఉడకపెట్టుకోవాలి. ఆ నీళ్ళు మొత్తం రెండు గ్లాసులు అయ్యే దాక బాగా మరిగించి దించి అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి .
* మరుసటి రోజు ఆ ఉలవ సూప్ లో చింతపండు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మరగపెట్టాలి.
* తరువాత కొత్తిమీరా తువుము చల్లుకొని దింపి, ఒక బాణలిలో నూనె పోసి కాగాక పోపు గింజలు వేసి తాలింపు పెట్టుకొని అందులో ఉలవల చారును పోసుకొని దించుకోవాలి.
నిమ్మ చారు
కావలిసిన వస్తువులు
నిమ్మకాయలు : 2
పచ్చిమిర్చి : 4
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు కలిపి రెండు గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
* ఒక బాణలిలో పోపులు వేసి వేయించి మరిగిన చారును పోసుకోవాలి.
* చారు చల్లారక నిమ్మకాయలును కోసుకొని గింజలు లేకుండా రసం పిండుకోవాలి.
** వేడిగా ఉన్న చారులో నిమ్మరసం పిండకూడదు ,చేదు వస్తుంది.
వంకాయ పాలకూర
కావలిసిన వస్తువులు
వంకాయలు : ఒక కిలో
పాలకూర : 5 కట్టలు
నూనె : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10 కాయలు
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* వంకాయలు ముక్కలుగా కోసుకోవాలి.
* పాలకూర సన్నగా తరుక్కోవాలి.
* ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపులు వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, వంకాయ ముక్కలు, పాలకూర తురుము వేసి, ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టాలి.
* కాసేపు సిమ్ లో మగ్గించి తరువాత మూత తీసి బాగా మగ్గించి దించుకోవాలి.
వంకాయలు : ఒక కిలో
పాలకూర : 5 కట్టలు
నూనె : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10 కాయలు
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* వంకాయలు ముక్కలుగా కోసుకోవాలి.
* పాలకూర సన్నగా తరుక్కోవాలి.
* ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపులు వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, వంకాయ ముక్కలు, పాలకూర తురుము వేసి, ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టాలి.
* కాసేపు సిమ్ లో మగ్గించి తరువాత మూత తీసి బాగా మగ్గించి దించుకోవాలి.
పచ్చి పులుసు
కావలిసిన వస్తువులు
చింతపండు : నిమ్మకాయంత
ఉల్లిపాయలు : 250 గ్రాములు
పచ్చిమిర్చి : 4
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీరా : సరిపడా
నూనె : 25 గ్రాములు
ఎండుమిరకాయలు : 1 కాయ
ఆవాలు : సరిపడా
జీలకర్ర : సరిపడా
ఉప్పు : సరిపడా
కారం : సరిపడా
పసుపు : సరిపడా
తయారుచేయు విధానం
* ఒక లీటరు నీళ్ళలో చింతపండును వేసి బాగా పిసికి పెట్టుకోవాలి.
* ఆ రసంలో ఉప్పు, పసుపు, కారం, ఓ చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి కొత్తిమీరని తరిగి వేసుకోవాలి.
* ఉల్లిపాయలను , పచ్చిమిర్చి ని సన్నగా కోసుకొవాలి.
* ఒక బాణలిలో నూనె ని పోసి కాగిన తరువాత ఎండుమిరగాయలు ముక్కలు , ఆవాలు,జీలకర్ర వేసుకొని బాగా వేయించి, కరివేపాకు వెయ్యాలి.
* తరువాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేయించి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఆ పోపులో ఓ పొంగు రానిచ్చి దించుకోవాలి.
రొయ్యల ఆవకాయ
కావలిసిన వస్తువులు
రొయ్యలు : ఒక కిలో
నూనె : అర కిలో
పచ్చికారం : 100 గ్రాములు
మెంతిపిండి : 50 గ్రాములు
ఆవపిండి : 50 గ్రాములు
వెల్లులి : 4 రెబ్బలు
పసుపు : ఒక స్పూను
నిమ్మరసం : ఒక కప్పు
తయారుచేయు విధానం
* రొయ్యల్ని వొలిచి కడిగి శుభ్రంగా పిండి ఒక పాత్రలో ఉంచుకోవాలి.
* ఒక బాణలిలో సగం నూనె పోసి బాగా కాగాక రొయ్యలు వేసి ఎర్రగా వేపి దించి ఒక పాత్రలో వేసి చల్లరుచుకోవాలి.
* బాణలిని పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె పోసి మసాలాలన్ని మిశ్రమం చేసి అందులో వేసి బాగా వేపి చల్లారిన రొయ్యలను వేసి బాగా కలిపి ఒక జాడీలో పెట్టుకోవాలి.
* మర్నాడు రుచి చూసుకొని ఏది తగ్గితే అది వేసుకోవాలి.
చికెన్ - చింతచిగురు
కావలిసిన వస్తువులు
చికెన్ : అర కిలో
చింత చిరురు : పావు కిలో
నూనె : 50 గ్రాములు
కారం : రెండు స్పూనులు
ఉల్లిపాయలు : 4
దాల్చిన చెక్క : కొద్దిగా
లవంగాలు : 4
పచ్చిమిర్చి : 4 కాయలు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చికెన్ ని ముక్కలుగా కోసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి.
* చింత చిగురు కాడలు లేకుండా ఆకులను బాగా నలిపి ఉంచుకోవాలి.
* ఉల్లిపాయలను, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక దాల్చినాచెక్క , లవంగాలు వేయాలి.
* ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగిన తరువాత చికెన్ ముక్కలు వేయాలి.
* అది కూడా ఇరిగాక ఉప్పు - కారం వేసి అరా లీటరు నీళ్ళు పోసి మూత పెట్టాలి.
* కొంచెం నీళ్ళు వుండగానే చింతచిగురు వేసి బాగా ఇరిగాక దించుకోవాలి.
గోంగూర రొయ్యలు
కావలిసిన వస్తువులు
రొయ్యలు : ఒక కిలో
గోంగూర : ఒక కిలో
నూనె : 100 గ్రాములు
పచ్చిమిర్చి : 20 కాయలు
కారం : రెండు స్పూనులు
వెల్లులి : 8 రెబ్బలు
కరివేపాకు : 10 రెబ్బలు
ఎండుమిర్చి : 8 కాయలు
తాలింపు దినుసులు : ఒక స్పూను
ఉల్లిపాయలు : రెండు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* రొయ్యలు వొలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
* గోంగూరను శుభ్రం చేసుకొని ఆకులు కోసుకొని అందులో కారం , ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.
* గోంగూర మెత్తగా మగ్గాక దించి నీళ్ళు వంచేసి మెదిపి ఉప్పు వేసుకోవాలి.
* బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత తాలింపు గింజలు వెల్లులి,ఎండుమిర్చి,కరివేపాకు వేయించి రొయ్యలు వేసి అవి కూడా బాగా వేగాక గోంగూర వేసి బాగా కలిపి దించుకోవాలి.
రొయ్యలు : ఒక కిలో
గోంగూర : ఒక కిలో
నూనె : 100 గ్రాములు
పచ్చిమిర్చి : 20 కాయలు
కారం : రెండు స్పూనులు
వెల్లులి : 8 రెబ్బలు
కరివేపాకు : 10 రెబ్బలు
ఎండుమిర్చి : 8 కాయలు
తాలింపు దినుసులు : ఒక స్పూను
ఉల్లిపాయలు : రెండు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* రొయ్యలు వొలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
* గోంగూరను శుభ్రం చేసుకొని ఆకులు కోసుకొని అందులో కారం , ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.
* గోంగూర మెత్తగా మగ్గాక దించి నీళ్ళు వంచేసి మెదిపి ఉప్పు వేసుకోవాలి.
* బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత తాలింపు గింజలు వెల్లులి,ఎండుమిర్చి,కరివేపాకు వేయించి రొయ్యలు వేసి అవి కూడా బాగా వేగాక గోంగూర వేసి బాగా కలిపి దించుకోవాలి.
చుక్కకూర మటన్
కావలిసిన వస్తువులు
మటన్ : ఒక కిలో
చుక్కకూర : 10 కట్టలు
నూనె : మూడు స్పూనులు
కారం : 150 గ్రాములు
ఉప్పు : సరిపడా
పసుపు : ఒక స్పూను
ఎండు కొబ్బరి : 50 గ్రాములు
అల్లం : కొద్దిగా
గసగసాలు : 50 గ్రాములు
వెల్లులి : ఒకటి
గరం మసాలా : 10 గ్రాములు
ఉల్లిపాయలు : 100 గ్రాములు
తయారుచేయు విధానం
* మటన్ ను బాగా కడిగి నీరు లేకుండా బాగా పిండాలి.
* బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
* దానిలో అల్లం - వెల్లులి , కారం, పసుపు వేసి కొంచెంసేపు వేగాక మటన్ కూడా కలిపి తగినంత ఉప్పు వేసి తగినంత నీరు పోసి అరగంట సేపు ఉడికించాలి.
* నీళ్ళు మరిగిపోతే కొంచెం నీరు పోయవచ్చు.
* ఉడుకుతున్న మటన్ లో నూరి వుంచుకొన్న గసగసాలు, కొబ్బరి , గరం మసాలా వేసి ఉడికించాలి.
* అదే సమయంలో చుక్కకూరను నీళ్ళలో కడిగి ముక్కలుగా కోసి మటన్ లో వేసి పావుగంట ఉడికాక దించుకోవాలి.
మెంతి గోంగూర
కావలిసిన వస్తువులు
గోంగూర : ఒక కిలో
మెంతుల పొడి : 100 గ్రాములు
నూనె : 200 గ్రాములు
ఎండుమిరపకాయలు : 50 గ్రాములు
ఆవాలు : 50 గ్రాములు
కారం : 250 గ్రాములు
ఇంగువ : చిటికెడు
పోపుగింజలు : సరిపడా
ఉప్పు : సరిపడా
పసుపు : సరిపడా
తయారుచేయు విధానం
1) గోంగూరను శుభ్రంగా కడిగి, బాగా ఆరాబెట్టాలి .
2) తరువాత దానిని నూనెలో వేయించాలి .
3) అందులో ఉప్పు పసుపు, మెంతిపొడి కలుపుకొవలి.
4) మరల నూనె కాచి ఎండుమిరకాయలు, ఆవాలు, పోపుగింజలు వేయించాలి.
5) దీనిని గోంగూర లో పోసి బాగా కలిపి చల్లారిన తరువాత జాడీలో పెట్టుకోవాలి.
గోంగూర : ఒక కిలో
మెంతుల పొడి : 100 గ్రాములు
నూనె : 200 గ్రాములు
ఎండుమిరపకాయలు : 50 గ్రాములు
ఆవాలు : 50 గ్రాములు
కారం : 250 గ్రాములు
ఇంగువ : చిటికెడు
పోపుగింజలు : సరిపడా
ఉప్పు : సరిపడా
పసుపు : సరిపడా
తయారుచేయు విధానం
1) గోంగూరను శుభ్రంగా కడిగి, బాగా ఆరాబెట్టాలి .
2) తరువాత దానిని నూనెలో వేయించాలి .
3) అందులో ఉప్పు పసుపు, మెంతిపొడి కలుపుకొవలి.
4) మరల నూనె కాచి ఎండుమిరకాయలు, ఆవాలు, పోపుగింజలు వేయించాలి.
5) దీనిని గోంగూర లో పోసి బాగా కలిపి చల్లారిన తరువాత జాడీలో పెట్టుకోవాలి.
వంకాయ ఇగురు * రుచి - అభిరుచి
కావలిసిన వస్తువులు
వంకాయలు : అర కిలో
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి : 6
కరివేపాకు : సరిపడా
పసుపు : కొద్దిగా
కారం : రెండు స్పూనులు
నూనె : 100 గ్రాములు
ఆవాలు : ఒక స్పూను
ఉప్పు : సరిపడా
తయారువిధానం :
1) వంకాయలు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
2) ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, కరివేపాకు వేసి వేపాలి.
3) తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలుపోసి అవి కూడా వేగిన తరువాత వంకాయ ముక్కలను అందులో వేసి, ఉప్పు, పసుపు కూడా వేసి మంట తగ్గించి మగ్గించాలి.
4) కొంచెం సేపు తరువాత కారం వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి కూర బాగా ఇగిరిన తరువాత దించుకోవాలి.
రొయ్యలు - ములక్కాయ కూర * రుచి - అభిరుచి
కావలిసిన వస్తువులు:
రొయ్యలు : ఒక కిలో
కారం : 6 స్పూనులు
ములక్కాయలు : 13
ఉప్పు : సరిపడా
ఉల్లిపాయలు : పన్నెండు
గసగసాలు : 6 స్పూనులు
నూనె : 250 గ్రాములు
పోడి మసలా : 4 స్పూనులు
పచ్చిమిర్చి : పది
కొత్తిమీర : 4 కట్టలు
పసుపు : కొంచెం
తయారుచేయు విధానం :
1) రొయ్యలను వొలిచి శుభ్రంగా కడిగి వుంచుకొవాలి.
2) ములక్కయలు ఫై పీచు తీసి ముక్కలుగా కోసి వుంచుకోవాలి.
3)ఉల్లిపాయలు - పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వుంచుకోవాలి.
4) గసగసాలు ముద్దగా నూరుకోవాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత రొయ్యలు వెయ్యాలి.
6) అవి బాగా వేగిన తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
7) బాగా దోరగా వేగిన తరువాత ములక్కాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ఒక పావుశేరు నీళ్ళు పోయాలి.
8) కొంచెం మగ్గిన తరువాత గసగసాల ముద్దా వెయ్యాలి.
9) పూర్తిగా ఇరిగిన తరువాత కొంచెం గ్రేవీ ఉంచుకొని పొడి మసాలా కొత్తిమీరా వేసి దించుకోవాలి.
ఎగ్ - 65
కావలిసిన వస్తువులు
ఉడికించిన గుడ్లు : 8
పంచదార : 100 గ్రాములు
కార్న్ ప్లోర్ : 100 గ్రాములు
టమోటాలు : 4
చిల్లీ సాస్ : 4 స్పూనులు
ఉప్పు : 4 స్పూనులు
పెరుగు : రెండు కప్పులు
నూనె : 100 గ్రాములు
పచ్చి గుడ్లు : 1
కరివేపాకు : కొంచెం
ఆరంజి కలర్ : కొద్దిగా
తయారుచేయు విధానం :
1) ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసి ఒక పచ్చి గుడ్డును కొట్టి తగిన ఉప్పు , కార్న్ ప్లోర్ కలపాలి.
2) నూనె లో వేపాలి.
3) ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
4) అందులో గుడ్ల ముక్కలు వేయాలి.
5) దానిలో పెరుగు,చిల్లీ సాస్, టేస్టింగ్ పౌడర్, పెప్పర్ పౌడర్ ఆరంజ్ కలర్ వేసి మరిగాక దించాలి.
వెన్నతో చేపల ఫ్రై
కావలిసిన వస్తువులు:
కొరమీను చేపలు : అర కిలో
వెన్న : 50 గ్రాములు
నూనె : 100 గ్రాములు
మిరియాల పొడి : ఒక చెంచా
నిమ్మకాయ : ఒకటి
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం:
1) కొరమీను చేపలలో ఒకే ఒక ముల్లు ఉంటుంది. చేప ను కోసి ఆ ముల్లును తీసివేయాలి.
2) చేపను చిన్న చిన్న ముక్క్కలుగా కోసుకోవాలి.
3) ఆ ముక్కలను ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
4) ఒక బాణలిలో నూనే పోసి బాగా కాగిన తరువాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేయించాలి.
5) దింపే ముందు కొత్తిమీర - వెన్న వేసి దించుకోవాలి.
కొరమీను చేపలు : అర కిలో
వెన్న : 50 గ్రాములు
నూనె : 100 గ్రాములు
మిరియాల పొడి : ఒక చెంచా
నిమ్మకాయ : ఒకటి
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం:
1) కొరమీను చేపలలో ఒకే ఒక ముల్లు ఉంటుంది. చేప ను కోసి ఆ ముల్లును తీసివేయాలి.
2) చేపను చిన్న చిన్న ముక్క్కలుగా కోసుకోవాలి.
3) ఆ ముక్కలను ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
4) ఒక బాణలిలో నూనే పోసి బాగా కాగిన తరువాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేయించాలి.
5) దింపే ముందు కొత్తిమీర - వెన్న వేసి దించుకోవాలి.
నేతితో రొయ్యల వేపుడు
కావలిసిన వస్తువులు
రొయ్యలు : 500 గ్రాములు
ఉల్లిపాయలు : 4
వెల్లుల్లి : సరిపడా
టమోటాలు : 3
సోపు : ఒక టీ స్పూను
పసుపు : ఒక టీ స్పూను
నెయ్యి : 100 గ్రాములు
కరివేపాకు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
1) రొయ్యలను వొలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
2) బాణలిలో నెయ్యి బాగా కాగిన తరువాత సోపు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటాలు మరియు వెల్లుల్లి వేసి బాగా వేపాలి.
3) తరువాత రొయ్యలు, ఉప్పు, పసుపు పొడి వేసి కలపాలి.
4) కారంవేసి బాగా కలిపి, వేగిన తరువాత దింపాలి.
ఆయిల్ లేని కోడికూర
కావలిసిన వస్తువులు
చికెన్ : అరకిలో
కారం : ఒక స్పూను
అల్లం : ఒక ముక్క
ఉల్లిపాయ : ఒకటి
పసుపు : ఒక స్పూను
వెన్న : కొద్దిగా
మిరియాలు : ఆరు
ఉప్పు : ఒక స్పూను
ధనియాలు : అరస్పూను
కొత్తిమీరా : ఒక కట్ట
తయారుచేయు విధానం :
1) ఒక పాత్రలో నీళ్ళుపోసి చికెన్ ముక్కలను ఉడకపెట్టాలి.
2) కొంచెంసేపు అయిన తరువాత మిరియాలు, అల్లం, కారం,ధనియాలు పొడి మెత్తగా నూరుకోవాలి.
3) ఈ మిశ్రమాని ఉడుకుతున్న ముక్కల్లో వేసి తక్కువ మంట ఫై ఉడికించాలి.
4) ఒక బాణలిలో వెన్న వేసి బాగా కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కల్ని వేయించి చికెన్ ముక్కలో ఉప్పు, ఉల్లి ముక్కలు వేసి మరో పది నిముషాలు ఉడకపెట్టాలి.
5) దింపేముందు కొత్తిమీరా వేసి దించుకోవాలి.
ఎగ్ టమోటా బాత్
కావలిసిన వస్తువులు:
బియ్యం : ఒక కేజీ
నూనె : 200 గ్రాములు
జీడిపప్పు : 200 గ్రాములు
గ్రుడ్లు : 8
ఆవాలు : రెండు స్పూనులు
నెయ్యి : 100 గ్రాములు
పచ్చిమిర్చి : 10
టమోటా : 1/2 కేజీ
జీలకర్ర : రెండు స్పూనులు
కొత్తిమీరా : ఒక కట్ట
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని కడిగి రెడీగా వుంచుకోవాలి.
2) పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి.
3) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక తాలింపు దినుసులు - పచ్చిమిర్చి వేయించాలి.
4) అవి కొద్దిగా వేగాక టమోటా కూడా వేసి వేయించాలి.
5) అంతకు ముందు రెడీగా ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేయాలి.
6) ఉడికిన తరువాత దించేటప్పుడు జీడిపప్పు - కొత్తిమీరా వేసి దించుకోవాలి.
7) చివరగా పైన నెయ్యి వెయ్యాలి.
బియ్యం : ఒక కేజీ
నూనె : 200 గ్రాములు
జీడిపప్పు : 200 గ్రాములు
గ్రుడ్లు : 8
ఆవాలు : రెండు స్పూనులు
నెయ్యి : 100 గ్రాములు
పచ్చిమిర్చి : 10
టమోటా : 1/2 కేజీ
జీలకర్ర : రెండు స్పూనులు
కొత్తిమీరా : ఒక కట్ట
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని కడిగి రెడీగా వుంచుకోవాలి.
2) పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి.
3) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక తాలింపు దినుసులు - పచ్చిమిర్చి వేయించాలి.
4) అవి కొద్దిగా వేగాక టమోటా కూడా వేసి వేయించాలి.
5) అంతకు ముందు రెడీగా ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేయాలి.
6) ఉడికిన తరువాత దించేటప్పుడు జీడిపప్పు - కొత్తిమీరా వేసి దించుకోవాలి.
7) చివరగా పైన నెయ్యి వెయ్యాలి.
ఎగ్ పులిహోర
కావలిసిన వస్తువులు:
బియ్యం : ఒక కేజీ
నూనె : 250 గ్రాములు
గ్రుడ్లు : 8
వేరుశేనకాయ పప్పు : 200 గ్రాములు
మినపప్పు : రెండు స్పూనులు
ఎండు మిర్చి : 20
ఉప్పు : సరిపడా
చింతపండు : 250 గ్రాములు
ఆవాలు : రెండు స్పూనులు
పసుపు : రెండు స్పూనులు
కరివేపాకు : సరిపడా
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని ఉడికించి, అందులో పసుపు వేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2) ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక అందులో తాలింపు దినుసులు, వేరుశనగ పప్పు వేసి బాగా వేయించాలి.
3) తరువాత దానిలో చిక్కగా తీసిన చింతపండు రసం వేసి ఉడికించాలి.
4) గ్రుడ్లులోని తెల్లని సొనను మాత్రమే దానిలో వేసి ఉడికిన బియ్యాన్ని కూడా వేసి ఉప్పు కలపాలి.
బియ్యం : ఒక కేజీ
నూనె : 250 గ్రాములు
గ్రుడ్లు : 8
వేరుశేనకాయ పప్పు : 200 గ్రాములు
మినపప్పు : రెండు స్పూనులు
ఎండు మిర్చి : 20
ఉప్పు : సరిపడా
చింతపండు : 250 గ్రాములు
ఆవాలు : రెండు స్పూనులు
పసుపు : రెండు స్పూనులు
కరివేపాకు : సరిపడా
తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని ఉడికించి, అందులో పసుపు వేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2) ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక అందులో తాలింపు దినుసులు, వేరుశనగ పప్పు వేసి బాగా వేయించాలి.
3) తరువాత దానిలో చిక్కగా తీసిన చింతపండు రసం వేసి ఉడికించాలి.
4) గ్రుడ్లులోని తెల్లని సొనను మాత్రమే దానిలో వేసి ఉడికిన బియ్యాన్ని కూడా వేసి ఉప్పు కలపాలి.
పెరుగుతో చికెన్
కావలిసిన వస్తువులు:
చికెన్ : ఒక కిలో
పెరుగు : ఆరు గ్లాసులు
అల్లం : పెద్దముక్క
వెల్లుల్లి : ఇరవై రెబ్బలు
ఉల్లి : నాలుగు
నూనె : 100 గ్రాములు
కొత్తిమిరా : ఒక కట్ట
గరం మసాలా : నాలుగు స్పూనులు
పసుపు : ఒక స్పూను
వేడినీళ్ళు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేసే విధానం:
1) చికెన్ ని శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి.
2) ఉల్లిపాయలను కోసుకోవాలి.
3) అల్లం - వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి.
4) ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు నీ వేయాలి.
5) ఇవి బాగా దోరగా వేగిన తరువాత కోసి ఉంచిన చికెన్ ముక్కలు వేయాలి.
6) ఇవి ఇరిగాక నీళ్లు పోయాలి.
7) పెరుగులో పసుపు - ఉప్పు కలపాలి. అందులో కొత్తిమీరా ముక్కలు వేయాలి.
8) గరం మసాలా కూడా కలపాలి.
9) ఈ పెరుగును కళాయిలో వున్నా చికెన్ మిశ్రమంలో కలిపాలి.
10) బాగా కలిపి కొంచెం మగ్గాక దింపేయాలి.
చికెన్ కూర్మా
కావలసినవి:
చికెన్ : అర కిలో
పెరుగు : ఒక కప్పు ( పుల్లగా )
నూనె : 50 గ్రాములు
ఉల్లి : రెండు
వెల్లులి : ఒక్కటి
గసగసాలు : రెండు స్పూన్లు
పసుపు : కొంచెం
ధనియాలు : రెండు స్పూన్లు
మైదా : 50 గ్రాములు
చెక్క : రెండు
లవంగాలు : మూడు
అల్లం : చిన్నముక్క
ఉప్పు : సరిపడా
కారం : రెండు స్పూనులు
పచ్చిమిర్చి : నాలుగు
కొత్తిమీరా : ఒక్క కట్ట
తోక మిరియాలు : కొంచెం
తయారుచేయు విధానం :
1) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2) పచ్చి సరుకంతా ఒక మసాలా గానూ, ఎండు సరుకంతా ఒక మసాలా గానూ నురుకోని ఉంచుకోవాలి.
3) చికెన్లో ఉప్పు, కారం, పసుపు పచ్చి మసాలా పట్టేలా బాగా కలపాలి.
4) ఇంకా అందులో పెరుగుపోసి బాగా కలపాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత చికెన్ వేయాలి.
6) కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ముక్క బాగా ఉడకడానికి ఒక గ్లాసుడు నీళ్ళు పోయాలి.
7) నీళ్ళు ఇరిగిపోతుండగా చికెన్ కూడా ఉడుకుతుంది.
8) కొత్తిమీరా, మైదా, ఎండు మసాలా వేసి బాగా కలిపి దించుకోవాలి.
Subscribe to:
Posts (Atom)