కావలిసిన వస్తువులు
శనగపిండి : 1 కప్పు
బియ్యం పిండి : 1 కప్పు
నెయ్యి : 2 టేబుల్ స్పూను
వంట సోడా : 1 చిటికెడు
ఉల్లిపాయ : 4
పచ్చిమిర్చి : 4
కారం : సరిపడా
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : సరిపడా
నూనె : సరిపడా
తయారుచేయు విధానం
* బియ్యం పిండి, శనగపిండి కలిపి ఇందులో ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి.
* కొద్దిగా వంటసోడా, నెయ్యి కలుపుకోవాలి.
* పిండిని బాగా కలుపుకొని మిగతా పదార్దాలు కూడా చేర్చాలి.
* పకోడీలు వేసుకొనేటప్పుడు పచ్చిమిర్చి ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకొని ఈ పేస్ట్ ను పకోడీ పిండిలో కలుపుకోవాలి. ఇలా చేస్తే పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడి చేసి, ఆ తరువాత కొద్ది కొద్దిగా పిండి తీసుకోని పకోడీలు వేసుకోవాలి.
No comments:
Post a Comment