కావలిసిన వస్తువులు
చింతపండు : నిమ్మకాయంత
పచ్చిమిర్చి : 10
మిరియాలు : 10
ఉప్పు : సరిపడా
కొత్తిమీరా : అర కట్ట
కరివేపాకు : 2 రెబ్బలు
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం
* రెండు గ్లాసుల నీళ్ళలో చింతపండు, ఉప్పు మరియు పసుపు వేసి బాగా పిసుకొని పెట్టుకోవాలి.
* ఆ నీళ్ళలో కరివేపాకు, కొత్తిమీరా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
* మిరియాలను మెత్తగా పొడుం కొట్టుకోని, చారు నీటిలో వేసుకోవాలి.
* తరువాత ఆ చారును బాగా మరిగించి దించి దానిని తాలింపు పెట్టుకోవాలి
No comments:
Post a Comment