కావలిసిన వస్తువులు
రొయ్యలు : ఒక కిలో
నూనె : అర కిలో
పచ్చికారం : 100 గ్రాములు
మెంతిపిండి : 50 గ్రాములు
ఆవపిండి : 50 గ్రాములు
వెల్లులి : 4 రెబ్బలు
పసుపు : ఒక స్పూను
నిమ్మరసం : ఒక కప్పు
తయారుచేయు విధానం
* రొయ్యల్ని వొలిచి కడిగి శుభ్రంగా పిండి ఒక పాత్రలో ఉంచుకోవాలి.
* ఒక బాణలిలో సగం నూనె పోసి బాగా కాగాక రొయ్యలు వేసి ఎర్రగా వేపి దించి ఒక పాత్రలో వేసి చల్లరుచుకోవాలి.
* బాణలిని పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె పోసి మసాలాలన్ని మిశ్రమం చేసి అందులో వేసి బాగా వేపి చల్లారిన రొయ్యలను వేసి బాగా కలిపి ఒక జాడీలో పెట్టుకోవాలి.
* మర్నాడు రుచి చూసుకొని ఏది తగ్గితే అది వేసుకోవాలి.