కావలిసిన వస్తువులు
చేపలు : ఒక కిలో
మామిడికాయలు : రెండు
పచ్చిమిర్చి : 12
ఉల్లిపాయలు : 250 గ్రాములు
వెల్లులి : 25 గ్రాములు
కారం : రెండు టీ స్పూనులు
ధనియాలు : 25 గ్రాములు
జీలకర్ర : 25 గ్రాములు
నూనె : 150 గ్రాములు
కరివేపాకు : సరిపడా
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చేపలను శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు వేసి బాగా కడిగి ఒక పాత్రలో ఉంచాలి.
* ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా ఉంచుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.
* మసాలా పొడులన్నీ చేపలకు పట్టేల కలపాలి.
* ఉల్లిపాయలు ఉన్న దానిలో చేపముక్కలు వేసి బాగా కలపండి.
* మామిడి కాయలను ముక్కలుగా కోసి ముందుగానే మెత్తగా ఉడికించి తరువాత చేపల ముక్కలలో కలపాలి.
* చేపలు బాగా ఉడికిన్చుకొని గ్రేవీ ఉంచుకొని దించుకోవాలి.
No comments:
Post a Comment