కావలసినవి:
చికెన్ : అర కిలో
పెరుగు : ఒక కప్పు ( పుల్లగా )
నూనె : 50 గ్రాములు
ఉల్లి : రెండు
వెల్లులి : ఒక్కటి
గసగసాలు : రెండు స్పూన్లు
పసుపు : కొంచెం
ధనియాలు : రెండు స్పూన్లు
మైదా : 50 గ్రాములు
చెక్క : రెండు
లవంగాలు : మూడు
అల్లం : చిన్నముక్క
ఉప్పు : సరిపడా
కారం : రెండు స్పూనులు
పచ్చిమిర్చి : నాలుగు
కొత్తిమీరా : ఒక్క కట్ట
తోక మిరియాలు : కొంచెం
తయారుచేయు విధానం :
1) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2) పచ్చి సరుకంతా ఒక మసాలా గానూ, ఎండు సరుకంతా ఒక మసాలా గానూ నురుకోని ఉంచుకోవాలి.
3) చికెన్లో ఉప్పు, కారం, పసుపు పచ్చి మసాలా పట్టేలా బాగా కలపాలి.
4) ఇంకా అందులో పెరుగుపోసి బాగా కలపాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత చికెన్ వేయాలి.
6) కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ముక్క బాగా ఉడకడానికి ఒక గ్లాసుడు నీళ్ళు పోయాలి.
7) నీళ్ళు ఇరిగిపోతుండగా చికెన్ కూడా ఉడుకుతుంది.
8) కొత్తిమీరా, మైదా, ఎండు మసాలా వేసి బాగా కలిపి దించుకోవాలి.
No comments:
Post a Comment