కావలిసిన వస్తువులు
నిమ్మకాయలు : 2
పచ్చిమిర్చి : 4
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు కలిపి రెండు గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
* ఒక బాణలిలో పోపులు వేసి వేయించి మరిగిన చారును పోసుకోవాలి.
* చారు చల్లారక నిమ్మకాయలును కోసుకొని గింజలు లేకుండా రసం పిండుకోవాలి.
** వేడిగా ఉన్న చారులో నిమ్మరసం పిండకూడదు ,చేదు వస్తుంది.
No comments:
Post a Comment