భోజనప్రియులకు ఈ బ్లాగ్ లో అన్ని రకాల వెజ్ , నాన్ వెజ్ మరియు ఫాస్ట్ ఫుడ్ వంటలు వున్నాయి.
పాలకోవా
కావలిసిన వస్తువులు
పాలు : ఒక లీటర్
పంచదార : 1/4 కేజీ
నెయ్యి : కొద్దిగా
తయారుచేయు విధానం
* పాలను సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ సుమారు గంట సేపు కాగనివ్వాలి.
* పాలు చిక్కబడి ముద్దగా అవుతుండగా పంచదారను పోసి మళ్ళి కలుపుకోవాలి.
* పంచదార కరిగి పల్చగా అయి తరువాత కోవా గట్టి పడుతుంది.
* అంచులు ఉన్న పళ్ళానికి నెయ్యి పూసి అందులోనికి కోవా పోసుకోవాలి.
* దానిని కొద్ది సేపు మెత్తగా నూరుకోవాలి. కోవా రెడీ.
చికెన్ పకోడి
కావలిసిన వస్తువులు
చికెన్ : 750 గ్రాములు
శనగపిండి : 600 గ్రాములు
తాజా నిమ్మరసం : 4 స్పూనులు
కారం : రెండు స్పూనులు
ఆవాల పొడి : 3 స్పూనులు
వెనిగర్ : 1 స్పూను
అజినోమాటో : 1 స్పూను
నెయ్యి : 250 గ్రాములు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చికెన్ ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పోర్క్ తో బాగా పొడిచి ఉప్పు కారం ఆ ముక్కలకు పట్టేలా చెయ్యాలి.
* మిగిలిన పొడి మసాలలన్ని ఆ ముక్కలకి కలిపి పైన నిమ్మరసం వెనిగర్ చల్లి బాగా కలిపి రెండు గంటలపాటు ఊరనివ్వాలి.
* శనగపిండి లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి.
* ఊరిన చికెన్ ముక్కలను పిండేసి వేరే గిన్నెలో వేసుకోవాలి.
* మొదట గిన్నెలో మిగిలిన మసాలలన్ని సెనగపిండి కలిపెయ్యాలి.
* నెయ్యిని బాగా కాచి చికెన్ ముక్కలిని పిండిలో ముంచి నేతిలో వేపాలి.
* సగం వేగాక సన్న సెగ చేసి బాగా వేయించాలి.
ఉగాది పచ్చడి
కావలసిన వస్తువులు :
వేప పువ్వు : 1కప్పు
బెల్లంపొడి : 1కప్పు
కొబ్బరికోరు : 1కప్పు
బాగాముగ్గిన అరటి పండ్లు : 6
మామిడికాయ : 1
కొత్తకారము : చిటెకెడు
ఉప్పు : అరస్పూను
శనగ పప్పు పొడి : 1కప్పు
చింతపండు : నిమ్మకాయంత
వేయించిన వేరుశనగపప్పు : అర కప్పు
తయారుచేయు విధానం
* చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి.
* అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి.
* మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి.
* చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి.
* వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
మామిడికాయ చేపల పులుసు
కావలిసిన వస్తువులు
చేపలు : ఒక కిలో
మామిడికాయలు : రెండు
పచ్చిమిర్చి : 12
ఉల్లిపాయలు : 250 గ్రాములు
వెల్లులి : 25 గ్రాములు
కారం : రెండు టీ స్పూనులు
ధనియాలు : 25 గ్రాములు
జీలకర్ర : 25 గ్రాములు
నూనె : 150 గ్రాములు
కరివేపాకు : సరిపడా
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చేపలను శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు వేసి బాగా కడిగి ఒక పాత్రలో ఉంచాలి.
* ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి రెడీగా ఉంచుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.
* మసాలా పొడులన్నీ చేపలకు పట్టేల కలపాలి.
* ఉల్లిపాయలు ఉన్న దానిలో చేపముక్కలు వేసి బాగా కలపండి.
* మామిడి కాయలను ముక్కలుగా కోసి ముందుగానే మెత్తగా ఉడికించి తరువాత చేపల ముక్కలలో కలపాలి.
* చేపలు బాగా ఉడికిన్చుకొని గ్రేవీ ఉంచుకొని దించుకోవాలి.
మటన్ తో పప్పు పులుసు
కావలిసిన వస్తువులు
మటన్ : ఒక కిలో
కందిపప్పు : 200 గ్రాములు
నూనె : 300 గ్రాములు
ఉల్లిపాయలు : 4
ఉప్పు : సరిపడా
వెల్లులి : 8 రెబ్బలు
లవంగాలు : 8
పచ్చిమిర్చి : 8
దాల్చినచెక్క : 8
కారం : 4 స్పూనులు
గసగసాలు : 4 స్పూనులు
చింతపండు : నిమ్మకాయంత
కొత్తిమీర : ఒక కట్ట
అల్లం : చిన్న ముక్క
కొబ్బరి : చిన్న ముక్క
తయారుచేయు విధానం
* పప్పు శుభ్రం చేసి ఒక పాత్రలో ఉంచాలి.
* చింతపండును నీళ్ళలో నానపెట్టుకోవాలి.
* మటన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
* ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఆల్లం వెల్లుల్లి ఒక ముద్ద, కొబ్బరి గసగసాలు ఒక ముద్ద గా నూరుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక చెక్క లవంగాలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉడికాక మటన్ వేసుకోవాలి .
* మసాలలున్ని అందులో వేసి, నీళ్లన్నీ ఇరిగిపోయక ఉప్పు కారం వేసి ఎసరు పొయ్యాలి.
* అందులో పప్పు వేసి మెత్తగా ఉదికించుకొని అందులో చింతపండు పులుసు పిసుకొని పోసుకోవాలి.
* గసగసాలు కొబ్బరి ముద్ద , కొత్తిమీరా వేసి గ్రేవీ ఉండేలా దించుకోవాలి.
వంకాయ పులుసు
కావలిసిన వస్తువులు
వంకాయలు : 1/4 కిలో
టమేటా : 4
చింతపండు : 25 గ్రాములు
నూనె : 25 గ్రాములు
పచ్చిమిర్చి : 10
ఉల్లిపాయలు : 4
ఎండుమిర్చి : 2 కాయలు
పోపుగింజలు : సరిపడా
కరివేపాకు : రెండు రెబ్బలు
పసుపు : సరిపడా
కారం : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* చింతపండు నీళ్ళలో నానపెట్టాలి.
* వంకాయలను నిలువుగా కోసుకోని నీళ్ళలో వేసి ఉంచాలి.
* ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరుముకోవాలి.
* టమేటాలు వేరే ప్లేట్లో కోసుకొని పెట్టుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపు గింజలు వేసి వేయించి కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి.
* తరువాత వంకాయ ముక్కలను వేసి ఉప్పు, పసుపు, కారం చల్లి మూత పెట్టి పది నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి.
* తరువాత నానపెట్టిన చింతపండును బాగా పల్చగా పులుసుగా పిసికి అది వంకాయ ముక్కలలో పోసి కొంచెం సేపు ఉడికించాలి.
* దానిలో టమేటా ముక్కలు వేసి ఐదు నిమిశాలుపాటు మగ్గిన తరువాత దించుకోవాలి.
మిరియాల చారు
కావలిసిన వస్తువులు
చింతపండు : నిమ్మకాయంత
పచ్చిమిర్చి : 10
మిరియాలు : 10
ఉప్పు : సరిపడా
కొత్తిమీరా : అర కట్ట
కరివేపాకు : 2 రెబ్బలు
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం
* రెండు గ్లాసుల నీళ్ళలో చింతపండు, ఉప్పు మరియు పసుపు వేసి బాగా పిసుకొని పెట్టుకోవాలి.
* ఆ నీళ్ళలో కరివేపాకు, కొత్తిమీరా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
* మిరియాలను మెత్తగా పొడుం కొట్టుకోని, చారు నీటిలో వేసుకోవాలి.
* తరువాత ఆ చారును బాగా మరిగించి దించి దానిని తాలింపు పెట్టుకోవాలి
ఉల్లిపాయపకోడిలు
కావలిసిన వస్తువులు
శనగపిండి : 1 కప్పు
బియ్యం పిండి : 1 కప్పు
నెయ్యి : 2 టేబుల్ స్పూను
వంట సోడా : 1 చిటికెడు
ఉల్లిపాయ : 4
పచ్చిమిర్చి : 4
కారం : సరిపడా
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : సరిపడా
నూనె : సరిపడా
తయారుచేయు విధానం
* బియ్యం పిండి, శనగపిండి కలిపి ఇందులో ఉప్పు, కారం కూడా కలుపుకోవాలి.
* కొద్దిగా వంటసోడా, నెయ్యి కలుపుకోవాలి.
* పిండిని బాగా కలుపుకొని మిగతా పదార్దాలు కూడా చేర్చాలి.
* పకోడీలు వేసుకొనేటప్పుడు పచ్చిమిర్చి ని మిక్సిలో వేసి మెత్తగా చేసుకొని ఈ పేస్ట్ ను పకోడీ పిండిలో కలుపుకోవాలి. ఇలా చేస్తే పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడి చేసి, ఆ తరువాత కొద్ది కొద్దిగా పిండి తీసుకోని పకోడీలు వేసుకోవాలి.
సొరకాయ హల్వా
కావలిసిన వస్తువులు
సొరకాయ : 1/2 కేజీ
పంచదార : 200 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
కోవా : 200 గ్రాములు
బాదంపప్పు : 10 గ్రాములు
పిస్తా పప్పు : 10 గ్రాములు
యాలకుల పొడి : 5 గ్రాములు
తయారుచేయు విధానం
* సొరకాయ ఫై చెక్కు తీసుకుని తరుముకోవాలి.
* దీన్ని నెయ్యిలో వేయించిన తరువాత పాలు, పంచాదార కలపాలి.
* పాలు బాగా ఇంకిపోయే వరకు ఉడికించి ముద్దగా అయినాక దించుకోవాలి.
* తరువాత ఫైనా యాలకుల పొడి చల్లాలి, కోవా, బాదంపప్పు, పిస్తాపప్పుతో అలంకరించుకోవాలి.
సొరకాయ : 1/2 కేజీ
పంచదార : 200 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
కోవా : 200 గ్రాములు
బాదంపప్పు : 10 గ్రాములు
పిస్తా పప్పు : 10 గ్రాములు
యాలకుల పొడి : 5 గ్రాములు
తయారుచేయు విధానం
* సొరకాయ ఫై చెక్కు తీసుకుని తరుముకోవాలి.
* దీన్ని నెయ్యిలో వేయించిన తరువాత పాలు, పంచాదార కలపాలి.
* పాలు బాగా ఇంకిపోయే వరకు ఉడికించి ముద్దగా అయినాక దించుకోవాలి.
* తరువాత ఫైనా యాలకుల పొడి చల్లాలి, కోవా, బాదంపప్పు, పిస్తాపప్పుతో అలంకరించుకోవాలి.
పిస్తా మిల్క్ షేక్
కావలిసిన వస్తువులు
చిక్కటి మీగడ పాలు : 1 లీటర్
పంచదార : 8 టీ స్పూనులు
పిస్తా పేస్టు : 50 గ్రాములు
పిక్కా కోవా : ఒక టేబుల్ స్పూను
ఐస్ క్యూబ్స్ : 6
యాలకుల పొడి : పావు స్పూను
ఉప్పు : సరిపడా
గ్రీన్ ఫుడ్ కలర్ : చిటికెడు
తయారుచేయు విధానం
* ముందుగా పాలను కాచి చల్లార్చాలి.
* మిక్సి జ్యూస్ జార్ లో పాలు, పంచాదార, పిస్తాపెస్ట్, పిక్కాకోవా, యాలుకలపొడి, ఉప్పు, పుడ్ కలర్, ఐస్ క్యుబ్స్ వేసి బాగా తిప్పాలి.
* కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది.
ఉలవచారు
కావలిసిన వస్తువులు
ఉలవలు : పావు కిలో
నూనె : 50 గ్రాములు
చింతపండు : 50 గ్రాములు
పసుపు : కొద్దిగా
కరివేపాకు : సరిపడా
పచ్చిమిర్చి : 8
కొత్తిమీర : సరిపడా
ఉప్పు : సరిపడా
పోపులు : సరిపడా
తయారుచేయు విధానం
* ఉలవలను ఒక రోజు ముందుగా 6 గ్లాసుల నీళ్ళలో ఉడకపెట్టుకోవాలి. ఆ నీళ్ళు మొత్తం రెండు గ్లాసులు అయ్యే దాక బాగా మరిగించి దించి అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి .
* మరుసటి రోజు ఆ ఉలవ సూప్ లో చింతపండు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మరగపెట్టాలి.
* తరువాత కొత్తిమీరా తువుము చల్లుకొని దింపి, ఒక బాణలిలో నూనె పోసి కాగాక పోపు గింజలు వేసి తాలింపు పెట్టుకొని అందులో ఉలవల చారును పోసుకొని దించుకోవాలి.
నిమ్మ చారు
కావలిసిన వస్తువులు
నిమ్మకాయలు : 2
పచ్చిమిర్చి : 4
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు కలిపి రెండు గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
* ఒక బాణలిలో పోపులు వేసి వేయించి మరిగిన చారును పోసుకోవాలి.
* చారు చల్లారక నిమ్మకాయలును కోసుకొని గింజలు లేకుండా రసం పిండుకోవాలి.
** వేడిగా ఉన్న చారులో నిమ్మరసం పిండకూడదు ,చేదు వస్తుంది.
వంకాయ పాలకూర
కావలిసిన వస్తువులు
వంకాయలు : ఒక కిలో
పాలకూర : 5 కట్టలు
నూనె : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10 కాయలు
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* వంకాయలు ముక్కలుగా కోసుకోవాలి.
* పాలకూర సన్నగా తరుక్కోవాలి.
* ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపులు వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, వంకాయ ముక్కలు, పాలకూర తురుము వేసి, ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టాలి.
* కాసేపు సిమ్ లో మగ్గించి తరువాత మూత తీసి బాగా మగ్గించి దించుకోవాలి.
వంకాయలు : ఒక కిలో
పాలకూర : 5 కట్టలు
నూనె : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10 కాయలు
పసుపు : సరిపడా
పోపులు : సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం
* వంకాయలు ముక్కలుగా కోసుకోవాలి.
* పాలకూర సన్నగా తరుక్కోవాలి.
* ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పోపులు వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, వంకాయ ముక్కలు, పాలకూర తురుము వేసి, ఉప్పు, పసుపు చల్లి మూతపెట్టాలి.
* కాసేపు సిమ్ లో మగ్గించి తరువాత మూత తీసి బాగా మగ్గించి దించుకోవాలి.
పచ్చి పులుసు
కావలిసిన వస్తువులు
చింతపండు : నిమ్మకాయంత
ఉల్లిపాయలు : 250 గ్రాములు
పచ్చిమిర్చి : 4
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీరా : సరిపడా
నూనె : 25 గ్రాములు
ఎండుమిరకాయలు : 1 కాయ
ఆవాలు : సరిపడా
జీలకర్ర : సరిపడా
ఉప్పు : సరిపడా
కారం : సరిపడా
పసుపు : సరిపడా
తయారుచేయు విధానం
* ఒక లీటరు నీళ్ళలో చింతపండును వేసి బాగా పిసికి పెట్టుకోవాలి.
* ఆ రసంలో ఉప్పు, పసుపు, కారం, ఓ చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలిపి కొత్తిమీరని తరిగి వేసుకోవాలి.
* ఉల్లిపాయలను , పచ్చిమిర్చి ని సన్నగా కోసుకొవాలి.
* ఒక బాణలిలో నూనె ని పోసి కాగిన తరువాత ఎండుమిరగాయలు ముక్కలు , ఆవాలు,జీలకర్ర వేసుకొని బాగా వేయించి, కరివేపాకు వెయ్యాలి.
* తరువాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేయించి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఆ పోపులో ఓ పొంగు రానిచ్చి దించుకోవాలి.
Subscribe to:
Posts (Atom)