కావలిసిన వస్తువులు
మటన్ : ఒక కిలో
కందిపప్పు : 200 గ్రాములు
నూనె : 300 గ్రాములు
ఉల్లిపాయలు : 4
ఉప్పు : సరిపడా
వెల్లులి : 8 రెబ్బలు
లవంగాలు : 8
పచ్చిమిర్చి : 8
దాల్చినచెక్క : 8
కారం : 4 స్పూనులు
గసగసాలు : 4 స్పూనులు
చింతపండు : నిమ్మకాయంత
కొత్తిమీర : ఒక కట్ట
అల్లం : చిన్న ముక్క
కొబ్బరి : చిన్న ముక్క
తయారుచేయు విధానం
* పప్పు శుభ్రం చేసి ఒక పాత్రలో ఉంచాలి.
* చింతపండును నీళ్ళలో నానపెట్టుకోవాలి.
* మటన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
* ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
* ఆల్లం వెల్లుల్లి ఒక ముద్ద, కొబ్బరి గసగసాలు ఒక ముద్ద గా నూరుకోవాలి.
* ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక చెక్క లవంగాలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉడికాక మటన్ వేసుకోవాలి .
* మసాలలున్ని అందులో వేసి, నీళ్లన్నీ ఇరిగిపోయక ఉప్పు కారం వేసి ఎసరు పొయ్యాలి.
* అందులో పప్పు వేసి మెత్తగా ఉదికించుకొని అందులో చింతపండు పులుసు పిసుకొని పోసుకోవాలి.
* గసగసాలు కొబ్బరి ముద్ద , కొత్తిమీరా వేసి గ్రేవీ ఉండేలా దించుకోవాలి.
No comments:
Post a Comment