కావలిసిన వస్తువులు:
రొయ్యలు : ఒక కిలో
కారం : 6 స్పూనులు
ములక్కాయలు : 13
ఉప్పు : సరిపడా
ఉల్లిపాయలు : పన్నెండు
గసగసాలు : 6 స్పూనులు
నూనె : 250 గ్రాములు
పోడి మసలా : 4 స్పూనులు
పచ్చిమిర్చి : పది
కొత్తిమీర : 4 కట్టలు
పసుపు : కొంచెం
తయారుచేయు విధానం :
1) రొయ్యలను వొలిచి శుభ్రంగా కడిగి వుంచుకొవాలి.
2) ములక్కయలు ఫై పీచు తీసి ముక్కలుగా కోసి వుంచుకోవాలి.
3)ఉల్లిపాయలు - పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వుంచుకోవాలి.
4) గసగసాలు ముద్దగా నూరుకోవాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత రొయ్యలు వెయ్యాలి.
6) అవి బాగా వేగిన తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
7) బాగా దోరగా వేగిన తరువాత ములక్కాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ఒక పావుశేరు నీళ్ళు పోయాలి.
8) కొంచెం మగ్గిన తరువాత గసగసాల ముద్దా వెయ్యాలి.
9) పూర్తిగా ఇరిగిన తరువాత కొంచెం గ్రేవీ ఉంచుకొని పొడి మసాలా కొత్తిమీరా వేసి దించుకోవాలి.
No comments:
Post a Comment